POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 11:14 pm Posted by : POLITICAL POWER

నారాయణ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

అనపర్తి ఎస్సై వినయ్ ప్రతాప్, ఏజీఎం అలీషా ముఖ్య అతిథులుగా హాజరు

అనపర్తి నారాయణ ఈ-టెక్నో ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎం విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన, ప్రిన్సిపాల్ నందకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి ఎస్సై వినయ్ ప్రతాప్, ఏజీఎం అలీషా హాజరయ్యారు. ముఖ్య అతిథులు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తిని ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశభక్తి గీతాలు, ప్రసంగాలు, నృత్య ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.

ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను విద్యార్థులు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి నినాదాలు, జాతీయ గీతాల మధ్య ఉత్సాహభరితంగా ముగిశాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.