POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 7:53 pm Posted by : POLITICAL POWER

ధాన్యం వెంట వెంటనే గోదాములకు తరలించాలి

 మంచిర్యాల అదనపు కలెక్టర్( రెవెన్యూ) రాములు

మే 10 : పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ : కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని వెంట వెంటనే గోదాములకు మిల్లులకు తరలించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. లక్షట్ పేట మండలంలోని ఇటిక్యాల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు తొందరగా ధాన్యమును గోదాములకు మిళ్లకు తరలించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు కేంద్రంలో దాన్యం ఉండకుండా వెంట వెంటనే తరలించాలని కోరారు అనంతరం లక్షెటిపేట తాసిల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు అదేవిధంగా వాటి తరలింపు పై పలు సలహాలు సూచనలు అధికారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక తహసిల్దార్ దిలీప్ కుమార్ ఐకెపి ఎపిఎం భూమక్క తో పాటు సంబంధిత అధికారులు ఉన్నారు.