POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 8:45 pm Posted by : POLITICAL POWER

శ్రీ డాక్టర్ *గడ్డం వివేక్ వెంకట స్వామి* మంత్రి ని కలిసిన

 *గవ్వల శ్రీకాంత్*

  1. పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారములు, గనులు మరియు భూగర్భ శాఖ మాత్యులు శ్రీ డాక్టర్ గడ్డం వివేక్ వెంకట స్వామి గారిని మర్యాదపూర్వకంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయం హైదరాబాద్ వారి కార్యాలయంలో కలవడం జరిగింది.

మంత్రి గారితో అనేక అంశాలపై స్థానిక ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలపై జన్నారం మండల గ్రామాల అభివృద్ధిపై

మరియు టైగర్ జోన్ చట్టం పేరుతో అటవీ అధికారులు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఇప్పుడు పాస్టగ్ పెట్టీ దోసుకుంటున్నారని అసలు వాహనాల వద్ద నుండి డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారని వాహన యజమానులు ప్రభుత్వానికి రోడ్ టాక్స్ చెల్లించకుండ దొంగ వాహనాలు నడుపుతున్నారా అని ప్రజలు భావిస్తున్నారని అనుకుంటున్నారని ప్రభుత్వం పై వ్యతిరేకత పెరుగుతుందని దానిపై పునరాలోచించుకోవాలని అదేవిధంగా

జన్నారం మండలం కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఉండటం వలన వ్యాపార పరంగా విద్య పరంగా ఆర్ధిక పరంగా అబివృద్ధి కావడం లేదని కనీసం తెలంగాణ ప్రభుత్వం పెదవాళ్ళకు ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు కూడ కట్టుకోవడానికి ఇసుక ఇటుక తో పాటు మెటీరియల్ కూడ దొరకడం లేదని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినట్లు గవ్వల శ్రీకాంత్ చెప్పారు

రాబోయే కాలంలో రాష్ట్రంలో నియోజక వర్గాలు పెరుగుతే మొదటి ప్రాధాన్యత జన్నారం మండలానికి ఇవ్వాలని జన్నారం అసెంబ్లీ నియోజకవర్గం బహుజన నియోజక వర్గం ఏర్పాటు చేయడానికి సహకరించాలని మంత్రి గారిని కలిసి కోరినట్లు జన్నారం అసెంబ్లీ నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ తెలిపినారు

వీరితో పాటుగా తెలంగాణ ఎస్ సి ఎస్ టి బీసీ మైనారిటీ విద్యార్తి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు వంచిత్ బహున్ అఘాడి రాష్ట్ర అధ్యక్షులు జన్నారం అసెంబ్లీ నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ గారితో పాటు సాంబారి ప్రశాంత్ కుమార్ మల్లేష్ తీగల శేఖర్ చంద్రయ్య అశోక్ లక్ష్మణ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు