ఈకేవైసీ లేకుంటే రేషన్ బంద్!

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం కార్డుదారులందరికీ e-KYC నమోదును పౌరసరఫరాలశాఖ తప్పనిసరి చేసింది. ఇందుకోసం ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. ఈ ప్రక్రియ ద్వారా కార్డుల్లో ఉన్న మృతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పరిధిలోకి వచ్చే అనర్హుల పేర్లను తొలగించి, కేవలం నిజమైన లబ్ధిదారులకే సరకులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. 5 ఏళ్లలోపు పిల్లలకు ఇందులో మినహాయింపు ఇచ్చారు. 5 నుండి 80 ఏళ్లలోపు వారు ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు.