వడ్డెర్లకు 92 జీవో ద్వారా 33% మైనింగ్ లో రిజర్వేషన్ కల్పించండి

ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య..
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్యూరో పసుపులేటి ఉమాశంకర్ కర్నూలు కలెక్టరేట్లో. జిల్లా బీసీ సంక్షేమ శాఖ.. జిల్లా సహకార శాఖ.. మైనింగ్ శాఖ. మూడు శాఖల సంయుక్తంగా.. వడ్డెర సంఘం ప్రతినిధుల సమావేశం జరిగింది … వడ్డెర్లు 25 మంది గ్రూపుగా ఏర్పడి కోపరేటివ్ సొసైటీస్ రిజిస్టర్ చేసుకోవాలని కోరడమైనది.. మైనింగ్ శాఖ వారు ఇప్పటికే జిల్లాలో 92 జీవో ప్రకారం వడ్డెర్ల కోసం కొన్ని మండలాల్లో వడ్డెర క్వారీ పూల్ ఏర్పాటు చేస్తామన్నారు… జీవో ప్రకారం మైనింగ్ పై హక్కులు వడ్డెర్లకు కల్పిస్తామన్నారు …. జిల్లాలో డివిజన్ల వారికి అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.. 92 జీవో ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య తెలిపారు.. కార్యక్రమంలో కర్నూలు జిల్లా నాయకులు చల్లా వెంకటేష్. బత్తుల ఎల్ల శివుడు.. కే. రామకృష్ణ.. గూడూరు నాగేష్.. ఓర్వకల్లు చిన్న.. బేతంచెర్ల మధు. చింతలపల్లి లక్ష్మీకాంత్.. మద్దిలేటి. నాయకల్లు సుబ్బరాయుడు.. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..