ముద్దం వారి పల్లెలో తాగునీటి సమస్యను తీర్చండి…

కలసపాడు మే 22 పొలిటికల్ పవర్ 9 టీవీ దినపత్రిక. రిపోర్టర్ ప్రసాద్ రావు కడప జిల్లా. కలసపాడు మండలంలోని మద్యం వారి పల్లి గ్రామంలో త్రాగునీటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని మా బాధను తీర్చే వారు ఎవరూ లేరా అంటూ సిపిఎం మండల నాయకుడు సగిలి .గురయ్య బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఇటీవల బీభత్సంఘ వచ్చిన గాలి వానలకు అక్కడక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో కరెంటు లేక ప్రజలు త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. అలాగే అనేక మూగజీవాలు కూడా నీరు లేక పస్తులు ఉండే పరిస్థితి వచ్చిందని వారు తెలిపారు. మూడు రోజుల నుండి గాలి వాన కురుస్తున్న కూడా గ్రామాల పర్యవేక్షణ చేసేందుకు ఒక్కరు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గాలి వచ్చి చెట్లు స్తంభాలు పడిపోయి ఇన్ని రోజులైనా స్థానిక సంబంధిత సచివాలయ సిబ్బంది గ్రామాలలో పర్యవేక్షణ లేకపోవడంతో, ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని స్థితిలో ప్రజలు ఉన్నారు అన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా స్థానిక ఎంపీడీవో మరియు స్పెషలాఫీసర్ల పరిపాలనలో ప్రజలకు కావలసిన సౌకర్యాలు అందించాలని వారు అన్నారు.