POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 8:48 am Posted by : POLITICAL POWER

మనదేశంలో ఎవరూ ,నమ్మలేని వింతలు ,విచిత్రాలు జరుగుతుంటాయి.

అవి కూడా చట్టాన్ని అడ్డం పెట్టుకునే జరుగుతాయి . బెంగళూరు పరప్పన అగ్రహారం సెంట్రల్ జైలు నుంచి ఓ జీవిత ఖైదీ దర్జాగా ఫేక్ సుప్రీంకోర్టు ఆర్డర్ చూపించి బయటికి వెళ్లిపోయాడు. ఇది జరిగి ఇప్పటికీ ఎనిమిదేళ్లు అయింది. మన అధికారులు ఇప్పుడు నిద్ర లేచారు. ఇదిప్పుడు సంచలనం కలిగించే అంశం. పరప్పన అగ్రహారంజైల్లో శంకర్ అనే వ్యక్తిపై 2001 కిడ్నాప్ కేసు కు సంబంధించి యావజ్జీవ శిక్ష పడింది. అయితే అతడు 2018 లో నకిలీ సుప్రీం కోర్టు ఆర్డర్ ద్వారా దర్జాగా బయటకు వచ్చేశాడు. ఎనిమిదేళ్ళ తరువాత ఇప్పుడు జైలు రికార్డుల్లో అది నకిలీ సుప్రీం కోర్టు ఆర్డర్ అని తేలింది.. అధికారులు కళ్ళు తేలేశారు. హడావుడిగా ఇప్పుడు జైల్లో అతడిపై మోసం, ఫోర్జరీ లాంటి నేరాల కింది కేసు కట్టారు..