నిజామాబాద్లో బహుళ వాహనాల ఢీ

పొలిటికల్ పవర్ పిఎన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
ఈరోజు ఇండల్వాయి మండలం, చంద్రాయనపల్లి సమీపంలో జాతీయ రహదారిపై 7 కార్లు, 2 లారీలు ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదం.
వివరాల ప్రకారం, అతివేగంగా వెళ్తున్న ఒక లారీ టైరు పగిలిపోవడంతో అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ఆగింది. ఫలితంగా, వెనుక నుండి వస్తున్న వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి.
అదే సమయంలో, కార్ల వెనుక నుండి వస్తున్న ఒక కొబ్బరి లారీ పక్క నుండి కార్లను ఢీకొట్టడంతో, అవి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడ్డాయి.
ఈ ప్రమాదంలో కార్లు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
…..