పదవ తరగతిలో అధిక మార్కులు సాధించిన *నైనారపు తన్మయి నీ అభినందించిన తెలంగాణ మాదిగ హక్కుల దండోరా (టీఎం హెచ్డి ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ దళిత రత్న మరియు

ముస్లిం లీగ్( IUML) ఐ యు ఎం ఎల్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ బాజీ బాబా.
మే 27 బుధవారం పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక ఈటీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్
ఖమ్మం నగరం 32 వ డివిజన్ జహీర్ పుర గుట్టల బజార్ లో నివాసముంటున్న నైనారపు ప్రసాద్ లక్ష్మీ ప్రసన్న కూతురు నైనారపు తన్మయి మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదివి ఎస్ ఎస్ సి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి 548 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు నైనారపు ప్రసాద్ కూతుర్ని తీసుకొని డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు నైనారపు తన్మయిని శాలువా కప్పి స్వీట్లు తినిపించి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు
ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ
విజయానికి పేదరికం ఎప్పుడు అడ్డు కాదని, పట్టుదలతో విజయాలను సాధించవచ్చని ఉన్నతరంగాలకు వెళ్లగలమని ఆయన అన్నారు.
తల్లిదండ్రులు మధ్యతరగతి ఎస్సీ మాదిగ కుటుంబానికి చెందిన వారు వారి కూతుర్ని చదివించినందుకు వివిధ కు లో సంఘాలు ప్రజా సంఘాలు ప్రముఖులు అందరూ అభినందించినారు పై చదువుల విషయంపై ఖమ్మం జిల్లా కలెక్టర్ కి దృష్టికి తీసుకెళ్లి ఉచిత విద్యని అందించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని చదివించాలని విజ్ఞప్తి చేయనున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కుక్కల రామకృష్ణ ఆర్కే దళిత రత్న పగిడి ముక్కుల విజయ్ కుమార్ దళిత రత్న రఘునాథపాలెం మండల అధ్యక్షులు కాంపాటి ఉపేందర్ దళితరత్న దుబాయ్ శ్రీను రైల్వే ఉద్యోగి టీఎంహెచ్డీ నియోజకవర్గ ఇన్చార్జ్ పిల్లిగుండ్ల ముత్తయ్య స్థానిక డివిజన్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నగర నాయకులు తోళ్ళ రాకేష్ తంబర్ల వెంకట కర్ణ తోళ్ళ శివ రవి గోపి తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
