POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 6:52 pm Posted by : POLITICAL POWER

*హాకావరి ధాన్యం కేంద్రం విజయవంతంగా ముగిసింది*

 *నాంపల్లి మండలం పొలిటికల్ పవర్ న్యూస్*

 

నాంపల్లి మండలం పెద్దాపురం గ్రామంలో హక దొడ్లు సన్నాలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ గాలెంక విజయ్ కుమార్ తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దొడ్డు రకం వరి ధాన్యం 62 లారీలు 441 రైతుల దగ్గర నుంచి 17735. 60 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది అన్నారు. సన్నాలు ధాన్యం 1 లారీ 10 మంది రైతులు 280.80 క్వింటాళ్లు కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లారీ ట్రాన్స్పోర్ట్ వెంకటరమణ, లారీ ట్రాన్స్పోర్ట్ సబ్ కాంట్రాక్టర్ రాజలింగం, కమిటీ సభ్యులు డాక్టర్ గాలెంక ఇందిర, భవాని బూచపమ్మ వెంకటమ్మ రైతులు హామాలీలు తదితరులు పాల్గొన్నారు.