తొలితరం విప్లవకారుడు హేతువాద ఉద్యమ ప్రముఖుడు

*కా,,క్రాంతి కార్ కి*, పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి సీపీఐ{ఎంఎల్} న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ *పక్షాన వినమ్రంగ*
*విప్లవ జోహార్లర్ఫిస్తుంది*l
డా.డామాబు లక్మయ్య,కా,,క్రాంతికార్ ,తీవ్రమైన అస్వస్థత తో ఖమ్మం లోని ఆరాధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం చనిపోయారు. ఆయన మరణం పట్ల *సీపీఐ{ఎంఎల్}* *న్యూడెమోక్రసీ కా,, చంద్రన్న పార్టీ,జిల్లా కమిటీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తుంది*
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామంలో కామ్రేడ్ క్రాంతి కార్ జన్మించారు. విద్యార్థిదశలోనే నక్సల్భరీ విప్లవోద్యమం వైపు ఆకర్షించబడ్డారు.
ఆయన నక్సలైట్ ఉద్యమం లో కీలక వ్యక్తి.ఈయన1970దశకంలో ‘నక్సల్భరీ’ అనబడే మాసపత్రిక నడిపారు1972 లో విరసం ఏర్పాటు సందర్భంగా తొలిమహాసభ ఖమ్మం లోనే జరిగింది.దీనినిర్వాహణలో ప్రముఖ పాత్ర వహించారు.డా.కోవూర్ తో కలిసి 1980దశకంలో హేతువాద ఉద్యమ విస్తరణకు కృషి చేశారు.పుస్తకాలు అన్నా, పుస్తక పఠనం చాలా ఇష్టం .హేతువాదం పత్రిక సంపాదకుడు గా సుదీర్ఘ కాలం పనిచేశారు.మూఢనమ్మకాలపై పోరాటం చేశారు.నిప్పులమీద నడక తదితర కార్యక్రమాలు తోపాటు అనేక హేతువాద సభలకు ఆయన ఆద్యుడు.
ఖమ్మం లోనే ఆయన హోమియో డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారు.ఆయన నియమ బద్ధమైన జీవితం గడిపారు.పలుపుస్తకాల రచయిత గా ప్రసిద్ధుడు.మతాలకు,వాటిమౌఢ్యాలకు వ్యతిరేకంగా పోరాడారు.ఆయనపలుమార్లు జైలు జీవితం సైతం గడిపారు.
ఖమ్మంజిల్లాలో ఎక్కడ సభలు జరిగినా హేతువాద పుస్తకాలు ప్రదర్శనతో ఆయన ప్రత్యక్షం అయ్యేవారు.జిల్లాలో , విప్లవోద్యమం తొలితరం నాయకుడుగా క్రాంతి కార్ ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు.ఆయన జీవిత సహచరి ఝాన్సీ రాణి రిటైర్డ్ లెక్చరర్ గా పనిచేశారు వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు,ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు నష్టకరమైంది హేతువాద ఉద్యమానికి తీవ్రమైన లోటు,కా,,క్రాంతి కార్ కి మరొక్కసారి
సీపీఐ{ఎంఎల్} న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ పక్షాన విప్లవ జోహార్లు*
కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తున్నాం.