POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 10:39 pm Posted by : POLITICAL POWER

రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

అడవి అజిలాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన కార్యక్రమంలో డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ మే 30 2026: రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పేర్కొన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని అడవి అజిలాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని తెలిపారు. నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ ప్రాజెక్టు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, పశుసంవర్ధక, పాడీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన శాఖల మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని చిన్నారెడ్డి తెలిపారు. అడవి అజిలాపూర్ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు పెరగడం ద్వారా రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. ఈ పథకం పనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తి అయ్యేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి సూచించారు. దేవరకద్ర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.