POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 8:17 pm Posted by : POLITICAL POWER

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం.. ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ.

 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ రంగారెడ్డి జిల్లా రిపోర్టర్ కే. బి రాజు.

 

ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పెండింగులో పెట్టవద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 129 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించరాదని అధికారులకు స్పష్టం చేశారు.ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు చెందిన (28) దరఖాస్తులు, ఇతర శాఖలకు చెందిన 101దరఖాస్తులు, మొత్తం 129 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జూన్ 2 నుండి జూన్ 12 వరకు నిర్వహించనున్న పర్యావరణ పరిరక్షణ.అటవీ అవగాహన వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది నిర్ణీత సమయానికి హాజరై తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ఒక సమర్థవంతమైన వేదిక. ప్రజల వినతులపై అధికారులు స్పందనాత్మకంగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కారం చూపాలి. అదే విధంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం, పర్యావరణ పరిరక్షణ వారోత్సవాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి (రెవెన్యూ), కిరణ్మయి (లోకల్ బాడీస్), వివిధ శాఖల జిల్లా అధికారులు,కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.