పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 10 2026: భూసేకరణ ప్రక్రియలో 50% పరిహారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని గతంలో హైకోర్టును ఆశ్రయించిన బాధితులు పూర్తి పరిహారం చెల్లించాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా, ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్లను ఆదేశించిన హైకోర్టు హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా పరిహారం చెల్లించలేదని దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లో, అధికారులకు వ్యతిరేకంగా బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన తెలంగాణ హైకోర్టు అసెంబ్లీ సమావేశాల వల్ల అధికారులు కోర్టుకు రాలేరని న్యాయమూర్తికి తెలిపిన ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పుడు అధికారులు విదేశాలకు వెళ్లి ఎలా తిరిగి వస్తారని, ఎయిర్పోర్టులో అరెస్ట్ చేస్తే ఏం చేసేవారని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి కోర్టు ఆదేశాలు ఇచ్చాక కూడా బడ్జెట్ లేదని, నిధులు అందుబాటులో ఉన్నప్పుడు చెల్లిస్తామని, ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తామని చెప్పడం ఏంటని అసహనం ఇటీవలే పరిహారం చెల్లించామని క్షమించాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరడంతో, కోర్టు ధిక్కరణ కేసును ముగించిన న్యాయమూర్తి