POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 4:25 pm Posted by : POLITICAL POWER

*ఘణంగా 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న A.శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

మేడ్చల్ మల్కాజ్గిరి :కీసర సర్కిల్ : జవహర్ నగర్ : స్థానిక సి.ఆర్.పి.ఎఫ్. పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, ముఖ్య అతిథిగా సదరన్ రీజియన్ ఐ.జీ.పీ. శ్రీనివాస్ పతాక ఆవిష్కరణ చేసి, విద్యార్థులకు మార్గదర్శకాలు విడుదల చేశారు. విద్యార్ధి దశ ఎంతో ముఖ్యమని విద్యతో పాటు సామాజిక అవగాహన

కలిగి దేశ సేవ లో ముందు ఉండే విధంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహానుభావులు చూపిన మార్గంలో నడిచి తల్లిదండ్రులకు, సమాజానికి ఉపయోగపడే విధంగా నలుగురికి మార్గదర్శకం కావాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో మార్చిఫాస్ట్ , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు, క్రీడల్లో వివిధ స్థాయిల్లో విజయం సాధించిన విద్యార్థులను ప్రశంస పత్రాల తో అభినందించారు. ఈ కార్యక్రమంలో పద్మజ, సి.ఆర్.పి.ఎఫ్. డి.ఐ.జీ.పీ. డా.వీర్రాజు, ఎసరు, డా. రాజకుమార్ వర్మ, ప్రిన్సిపల్ D అపర్ణ, హరీశంకర్, హెచ్.ఎం. ఆశ జి కుమార్, సీ.సీ.ఏ. డిపార్టుమెంటు, సి.ఆర్.పి.ఎఫ్.ఆఫీసర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల, విద్యార్థులు విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.