ఆగస్టు 8. పొలిటికల్ పవర్ పిన్ 9టీవీ’ సమగ్ర తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం ప్రసాద్ రావు కలసపాడు కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు విచారణకు ఆర్ సి ఎం బిషప్ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు వస్తున్నట్లు కలసపాడు విచారణ గురువులు కొత్తపల్లి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని సుమారు 60 మందికి దివ్య సత్ప్రసాదం మరియు భద్రమైన అభ్యంగo లాంటి దివ్య సంస్కరణ సాoఘ్యాలను ఇస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం మరియ తల్లి మంట పాలను నిర్మించుటకు భూమి పూజ చేస్తారని వారు తెలిపారు. అనంతరం చక్కటి సమిష్టి ఆదివార దివ్యబలి పూజ, చక్కటి మధ్యాహ్న ఆత్మీయ విందు, అలాగే రాష్ట్ర వార్డు గ్రహీత కీర్తిశేషులు ఎస్. భజన పుల్లయ్య గారి అల్లుడు ప్రసాద్ రావు ఆధ్వర్యంలో కోలాటం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల ప్రజలు పి పి సి నెంబర్లు, గ్రామ పెద్దలు యువకులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.