POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 5:20 pm Posted by : POLITICAL POWER

చివరికి కాళేశ్వరమే దిక్కైంది

 

!
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఎడిటర్ డెస్క్
నోరు తెరిస్తే కాళేశ్వరం మీద అసత్య ఆరోపణలు చేస్తూ, చివరికి కరువు సమయంలో హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడుతున్న రేవంత్ రెడ్డి

సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటిమట్టం భారీగా పడిపోవడంతో హైదరాబాద్ మంచినీటి కోసం మల్లన్నసాగర్ నుండి నీళ్లు తరలించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం

మిషన్ భగీరథ పథకం కింద మల్లన్నసాగర్ నుంచి రోజుకు అదనంగా 25 నుంచి 30 మిలియన్ గ్యాలన్ల (MGD) నీటిని తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

మల్లన్నసాగర్ నుండి నీటిని తరలించేందుకు 4 కిలోమీటర్ల పైప్‌లైన్ ఏర్పాటుకు అటవీ శాఖ నుండి అనుమతులు పొందిన జలమండలి

పైప్‌లైన్ పనులను 50 నుంచి 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్రణాళిక

అదనంగా వచ్చే నీటితో ప్రధానంగా కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఉప్పల్, మల్కాజిగిరి ప్రాంతాలకు తాగునీరు అందించాలని నిర్ణయం