POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 6:13 pm Posted by : POLITICAL POWER

అంబం ఆర్ గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లీకేజీ…

మిషన్ భగీరథ పైపు లీకేజీ…

 

15 రోజులు గడుస్తున్న పట్టించుకోని అధికారులు…

 

మిషన్ భగీరథ నీళ్లు కలుషితమై ప్రజల ప్రాణాలకు నష్టం వాటిలితే ఎవరు బాధ్యులు…

 

పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం…

 

రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం ఆర్ గ్రామంలో గత 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు నిలిచిపోవడం జరిగిందని స్థానిక సర్పంచ్ గ్రామ ప్రజలు తెలిపారు.

గ్రామంలోని ధర్మీ లక్ష్మీ పొలంలో మెయిన్ పైప్ లైన్ పలిగిపోవడం జరిగిందని గత 15 రోజులు నుండి మిషన్ భగిరద అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందించడం లేదని, వర్షాకాలం సీజన్లో నీటి కలుషితంతో అనేక రోగాలు సమస్యలు, ఎదురుకోవాల్సి వస్తదని వాంతులు, విరోచనాలతో సమస్యలు ఏర్పడతాయని, కావున మిషన్ భగీరథ అధికారులు వెంటనే స్పందించి పైపులైను లీకేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసి గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు అందించాలని కోరారు. నీటి కలుషితంపై జిల్లా కలెక్టర్లు కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికిని, మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఇట్టి కార్యక్రమంలో అంబం ఆర్ గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్, శానం పెద్ద వెంకటేశం,కురుమ బాలయ్య, శానం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.