స్టేట్ బ్యూరో : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.
పరకాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీజేపీ నాయకుల ఇళ్లకు పోలీసులు వెళ్లి ముందస్తు అరెస్టులు చేయడం, నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా?. ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం నేరమా?. బీజేపీ నాయకులను భయపెట్టే ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును, ప్రశ్నించే గొంతును అణచివేయాలని చూస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. నియంతృత్వాన్ని ఎదిరిద్దాం!. బీజేపీ పరకాల పట్టణ శాఖ.