
దాచేపల్లి వార్డులలో ఇంటింటికి విస్తృత ప్రచారం
పొలిటికల్ పవర్: గురజాల నియోజకవర్గం, దాచేపల్లి 1 వవార్డులో ప్రారంభమైన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. సీఎంచంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెండేళ్ల నమ్మకం సంక్షేమం, అభివృద్ధి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యేయరపతినేని శ్రీనివాసరావు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యరపతినేని నిఖిల్ బాబు సూచనల మేరకు 1వ వార్డు ఇంచార్జ్ కూరాకుల నాగేశ్వర రావుఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో సిఎంచంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం (టీడీపీ,బీజేపీ, జసేన) ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం,అభివృద్ధి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు వివరించి వారి సలహాలు, సూచనలు తీసుకుని రానున్న కాలంలో మెరుగైన పాలన అందించటానికి ఈ కార్యక్రమం చేపట్టారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై యరపతినేని నినాదాలతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి చేసిన సంక్షేమ పథకాలను వివరించి ఇంకా రాబోయే కాలంలో మంచి పరిపాలన అందిస్తామని ప్రతి ఒక్కరికికర్ర పత్రం ఇచ్చిభరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలోటిడిపి నాయకులు కూరాకుల నాగేశ్వర రావు బండ్ల ప్ర భు దాసు మహిళ అధ్యక్షరాలు హూసేనమ్మ అమర్ దీప్ అల్లీ రాజేష్ చిన్న కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.