పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 28 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లి గ్రామం 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యకర భవిష్యత్ కి బాటలు వేయాలని కోరడమైంది. పిల్లలు ఇంతకు ముందు పోలియో చుక్కలు తీసుకున్నప్పటికీ, ఈసారి కూడా తప్పకుండా వేయించాలని,ప్రతి డోస్ మీ చిన్నారికి మరింత రక్షణను అందిస్తుందని చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో 181మంది చినారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని ఏఎన్ఎం జ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, ఏఎన్ఎం జ్యోతి నాగరాజు జీపీవో, వార్డ్ సభ్యులు యాదమ్మ అంగన్వాడి కార్యకర్తలు సునీత లక్ష్మి ఆశా కార్యకర్తలు హేమలత తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు పోలీయో చుక్కలు వేయిద్దాం.. మన గ్రామాన్ని పోలియో రహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం..
