పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 29 2026: హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినంత మాత్రాన ఎవరికైనా పార్టీ టికెట్ ఖరారైనట్లు కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పరకాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో ఫ్లోలో రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని వ్యాఖ్యానించారని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బీఫాం ఇచ్చినట్లుగా భావించాల్సిన అవసరం లేదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు అనుగుణంగానే టికెట్లు ఖరారవుతాయని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినంత మాత్రాన బీఫాం ఇచ్చినట్లు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
