జూలూరుపాడు ఆగస్టు 11: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక తెలుగు న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద భక్తులు, గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయాలని.కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీ లేళ్ల గోపాల్ రెడ్డి విద్యుత్ శాఖ ఏఈ లైన్ మేన్ లను కోరారు .
ఈ మేరకు జూలూరుపాడు విద్యుత్ శాఖ ఏఈ, లైన్మెన్లను గద్దెల వద్దకు పిలిపించి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యుత్ స్తంభాలు, లైట్ల ఏర్పాటుకు అవసరమైన ఎస్టిమేషన్ తయారు చేసి, మ్యాప్ రూపొందించి చుట్టుపక్కల ప్రాంతాల్లో లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు.
కాంగ్రెస్ నాయకులు వివరించిన సమస్యలను విన్న విద్యుత్ శాఖ ఏఈ స్పందిస్తూ, త్వరలోనే విద్యుత్ స్తంభాలు, లైట్లు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
- ఈ కార్యక్రమంలో బాదావత్ హరీష్, మొగిలిపువ్వు శ్రీనివాసరావు, 7వ వార్డు నంబర్ బాదావత్ నాగరాజు, కుసుమరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


