ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్ ఏర్పాట్లపై మంచిర్యాల డీసీపీ క్షేత్రస్థాయి సందర్శన

మే 19 :

పొలిటికల్ పవర్ పిఎన్ 9 టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి నది అంత్య పుష్కరాల నేపథ్యంలో భక్తుల రాకపోకలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రోజు మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు మరియు ఇతర పోలీస్ అధికారులతో కలిసి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలు, ప్రధాన రహదారులు, వంతెనలను సందర్శించి పరిశీలించారు.ఈ పుష్కరాలు మే 21వ తేదీ ఉదయం నుండి 12 రోజుల పాటు కాళేశ్వరం సరస్వతి నది తీరంలో జరగనున్నాయి.ఈ సందర్భంగా రామగుండం,పెద్దపల్లి,ఆదిలాబాద్,నిర్మల్,ఆసిఫాబాద్,మంచిర్యాల జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి జైపూర్, భీమారం,చెన్నూర్ మార్గాల మీదుగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.భక్తుల రాకపోకలు సజావుగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,భద్రతా చర్యలు మరియు అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై అధికారులతో చర్చించారు. పుష్కరాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు డీసీపీ ఆదేశాలు జారీ చేశారు.డీసీపీ వెంట జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, కోటపల్లి ఎస్సై రాజశేఖర్,భీమారం ఎస్సై రాజేందర్ పాల్గొన్నారు.       

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!