నేరాలు అదుపు చేసేందుకే కార్డునెంట్ సర్చ్

సీఐ రమణమూర్తి

పొలిటికల్ పవర్ పిఎన్9 న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా,లక్షట్ పేట్ నేరాలను అదుపు చేసేందుకు పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించడం జరుగుతుందని లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి అన్నారు. బుధవారం ఉదయం పట్టణంలోని మహాలక్ష్మి వాడ గోదావరి రోడ్ మోదల రోడ్లో కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ సోదాల్లో సుమారు 46 బైకులు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వాడల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా తిరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.ఇండ్లను అద్దెకిచ్చే సమయంలో వారి పూర్తి వివరాలను తెలుసుకున్నాక అద్దెక్కివ్వాలని పరిచయం లేని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఇండ్లను అద్దెకి ఇవ్వకూడదు అన్నారు. ఎవరైనా ఫోన్ చేసి బ్యాంక్ సమాచారాలు ఇతర ఓటిపిలు అడిగితే ఫోన్లో చెప్పకూడదని బ్యాంకు లావాదేవీలు ఏవి ఉన్నా వెంటనే బ్యాంకుకు వెళ్లి చూసుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు మైనర్ తో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లక్షేట్టిపేట దండేపల్లి జన్నారం ఎస్సైలు గోపతి సురేష్, తహసియోద్దీన్, ఉదయ్ కిరణ్, తోపాటు లక్షెట్టిపేట సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
