ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ నిర్వహించనున్న “సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ” ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు అన్ని వర్గాల ప్రజలు, యువత, మహిళలు, కార్మికులు, రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదర సోదరీమణులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు, సమాన అవకాశాలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ రక్షణ సేన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతి వర్గానికి న్యాయం, ప్రతి కుటుంబానికి అవకాశం కల్పించే దిశగా ఈ సంకల్ప సభ ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని అన్నారు. “సామాజిక న్యాయ తెలంగాణ” సాధన కోసం నిర్వహిస్తున్న ఈ సంకల్ప సభ తెలంగాణ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కావున ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని “సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ”ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!