పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :
కాప్రా :భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు పిలుపు మేరకు వంపుగూడ నివాసి, బీజేపీ నాయకుడు నిశాంత్ వంపుగూడలోని తన ఇంటిపై హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా చిన్నారులతో కలిసి జాతీయ జెండాను ప్రదర్శించారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని నిశాంత్ పిలుపునిచ్చారు. జాతీయ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
