– వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.13.2026.వినాయకచవితిపర్వదినాన్నిపురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతుబాధ్యతగామట్టివినాయకవిగ్రహాలనుప్రతిష్ఠించాలని వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో కొత్తకోట పట్టణ కేంద్రంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈసందర్భంగా వనపర్తిజిల్లాఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు భీమా ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలోఉచితంగాపంపిణీచేశారు.పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకుబదులుగాసహజసిద్ధమైనమట్టివిగ్రహాలను ఉపయోగించడంద్వారాపర్యావరణపరిరక్షణకుతోడ్పడవచ్చని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా భక్తులు మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించి కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో స్థానిక ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుభీమచంద్రకాంత్ పట్టణ మహిళ సంఘం అధ్యక్షురాలు జయలక్ష్మి మహిళలు జ్యోతి , భీమ భారతి , రాణి , అనిత , పూరి స్వప్న , అరుణ , లక్ష్మీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


