ePaper
Saturday, September 12, 2026
📄 ePaper

కాంగ్రెస్ లోకి వలసల జోరు

📰 Generate e-Paper Clip

పాలేరు నియోజకవర్గం  ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్‌ఎస్‌, సీపీఐ పార్టీల నుంచి 25 కుటుంబాల చేరిక

ఖమ్మం రూరల్‌: కామంచికల్‌ గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్‌ఎస్‌, సీపీఐ పార్టీలకు చెందిన 25 కుటుంబాలు కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. శనివారం ఖమ్మంలోని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వమని అన్నారు. ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను గడపగడపకూ చేరుస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా పాలనకు జై.. కాంగ్రెస్‌లో చేరికలకు సై అంటూ వలసల జోరు కొనసాగుతోందని అన్నారు.కాంగ్రెస్‌లో చేరిన ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో.కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్రతాపనేని రఘు, మాజీ సర్పంచ్ యాదా లింగయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ మక్కా మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ కె. మైబు, జంగాల రామారావు, చింతకాయల వెంకన్న, బండారు నాగేశ్వరరావు, దాసరి వెంకటనారాయణ, అనంతనేని మురళి, లక్ష్మణ్, జంగం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయ్యాలి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,– కొత్తకోట ఎస్సైలు...

పామాయిల్ గెలల దొంగతనాలకు చెక్‌.. పోలీసుల కఠిన చర్యలు

ఫ్యాక్టరీల యాజమాన్యాలు,కలెక్షన్ ఏజెంట్లతో పోలీసుల సమావేశం.. రైతులకు కీలక సూచనలు పొలిటికల్ పవర్,దమ్మపేట...

Related Articles

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. కొమరిపాలెం గ్రామ శివారులోని చేపల చెరువుల వద్ద అక్రమ బాణసంచా తయారీ జరుగుతున్నట్లు...

రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు,పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.13.2026.రాజీమార్గంద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వరన్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యంమని,3వ జాతీయ...
error: Content is protected !!