జ్వరంతో మహిళ మృతి
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
దండేపల్లి:
తీవ్రమైన జ్వరంతో దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన చుంచు శ్రీవాణి అనే 24 సంవత్సరాల మహిళ మృతి చెందింది. మృతురాలు నిన్న తీవ్రజరంతో ఉండగా తన భర్త రాజకుమార్ లక్షట్ పేట పట్టణంలోని గోదావరి రోడ్లో చూపించి ఇంటికి తీసుకు వెళ్ళగా రాత్రి మృతురాలికి తీవ్రంగా వాంతులు కావడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీవాణి మృతి చెందింది. మృతురాలి తండ్రి గొల్ల సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. తన మృతి పై ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని తండ్రి ఫిర్యాదు చేశాడు. మృతురాలికి ఇద్దరు పిల్లల సంతానం ఉన్నారు.


