ePaper
Friday, September 18, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

అంతర్ జిల్లాల దొంగతనం కేసులో పోలీసుల.. అదుపులో కాంగ్రెస్ యువనేత మనం రిపోర్టర్ “పిల్లి రాహుల్” ?

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

*వీరి ముఠా నాయకుడు పాకాలపాటి ధర్మతేజ?*

.*అతని తమ్ముడు మోహన్ రాయ్ కూడా ?*

*చిన్నబీరవల్లిలో పెను సంచలనంగా మారిన సంఘటన*

*రాహుల్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందినీ విక్రమార్క పేరుతో పలు దందాలు❓*

*నందినీ విక్రమార్క పేరుతో నిత్యం ఇసుక దందాలు❓*

*గురువారం రాత్రి అదుపులో తీసుకున్న పోలీసులు*?

 

*గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన సిపిఎం కార్యకర్త ఎర్రబోయిన నాగేశ్వరరావు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమ్మనేని రమేష్ ప్రధాన అనుచురుడే ఈ పిల్లి రాహుల్

ఇప్పటికైనా ఇలాంటి వారి పట్ల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందినీ విక్రమార్క జాగ్రత్త వహించాల్సి అవసరం ఉంది.

– బోనకల్-

అంతర్ జిల్లాల బంగారం దొంగతనం కేసులో కాంగ్రెస్ యువ నేత పిల్లి రాహుల్, రాహుల్ మేనత్త కుమారుడు దొంగతనాల కేసులో భాగస్వామిగా ఉన్నాడనే సమాచారంతో పాకాలపాటి మోహన్ రాయ్ లను పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మండల పరిధిలోనే చిన్న బీరవల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకోవడంతో సంచలనంగా మారింది. స్థానికులు, విశ్వసినీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి…

మండల పరిధిలోనే చిన్న బీరవల్లి గ్రామానికి చెందిన పాకాలపాటి ధర్మతేజ, పాకాలపాటి మోహన్ రాయ్ అన్నదమ్ములు. ప్రస్తుతం పాకాలపాటి ధర్మతేజ కోదాడ పట్టణంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. పాకాలపాటి మోహన్ రాయ్ ప్రస్తుతం చిన్న బీరవల్లి లోనే నివాసము ఉంటున్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ యువ నేతనని, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని ప్రధాన అనుచరుడుగా చెప్పుకుంటున్న పిల్లి రాహుల్ చిన్న బీరవల్లిలోనే నివాసం ఉంటున్నాడు. మండల పరిధిలోని గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన సిపిఎం కార్యకర్త ఎర్రబోయిన నాగేశ్వరరావు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమ్మనేని రమేష్ ప్రధాన అనుచురుడే ఈ పిల్లి రాహుల్ కావటం విశేషం. అయితే పాకాలపాటి ధర్మ తేజ వివిధ ప్రాంతాలను నివాసాలుగా చేసుకుంటూ తరచూ మారుస్తూ ఉంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కోదాడ పట్టణంలో గత కొన్ని రోజుల క్రితం భారీ బంగారం చోరీ జరిగింది. ఈ చోరీ కేసులో పాకాలపాటి ధర్మ తేజ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ధర్మతేజ కోసం కోదాడ, సూర్యాపేట పోలీసులు రెండు నెలలుగా మూడు టీములుగా ఏర్పడి గాలిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇదే కేసులో చిన్న బీరువల్లి గ్రామానికి చెందిన సోమ సుబ్బారావు కుమారుడు సోమ రావిల్ ను రెండు రోజుల క్రితం కోదాడ, సూర్యాపేట పోలీసులు చిన్న బీరవల్లి లో అర్ధరాత్రి వచ్చి అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం రావిల్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఈ క్రమంలో రావిల్ ఇచ్చిన మేరకు సమాచారం మేరకు పోలీసులు గురువారం అర్ధరాత్రి చిన్న బీరువల్లి లో పిల్లి రాహుల్, మోహన్ రాయ్ ఇళ్లపై దాడులు చేశారు. కట్టుబట్టలతో పిల్లి రాహుల్ ని, పాకాలపాటి మోహన్ రాయ్ లను తీసుకెళ్లారు. ఈ దొంగతనం కేసులో వీరికి ప్రధాన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిసింది. అయితే ఈ దొంగతనానికి ముఠా నాయకుడిగా పాకాలపాటి ధర్మతేజ అని ప్రచారం సాగుతుంది. హైదరాబాద్, చుట్టుపక్కల పలు ప్రాంతాలలో జరిగిన కొన్ని దొంగతనాల కేసులలో వీరు నిందితులుగా ఉన్నట్లు తెలిసింది. పోలీసుల అర్ధరాత్రి వచ్చి అదుపులోకి తీసుకొని తీసుకెళ్లడంతో చిన్న బీరవల్లి గ్రామంలో ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంసముగా మారింది. ఎవరి నోటా విన్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే చర్చ జోరుగా సాగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ యువనేతనని, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని ప్రధాన అనుచరుడనని అంటూ గ్రామంలో పిల్లి రాహుల్ చేయని అరాచకం అంటూ లేదని స్థానికులు అంటున్నారు. కోదాడ, పలు ప్రాంతాలలో జరిగిన బంగారం దొంగతనం కేసులో సుమారు అర కేజీ వరకు ఉంటుందని తెలిసింది. ఈ కేసులో మరి కొంతమంది కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే వీరిని అదుపులో తీసుకున్నది కోదాడ, సూర్యాపేట పోలీసులని తెలుస్తుంది. ఈ విషయంపై బోనకల్ ఎస్సై పొదిలి వెంకన్న ను వివరణ కోరగా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే వారిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నది నిజమేనని తెలిపారు.

Latest Articles

గిరిజన భూములపై రాజకీయ తోడేళ్ల కళ్ళు

✓ పేదరికంలో మగ్గుతున్న ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి.✓ పత్రాలు,...

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం...

*కుర్లి శివా రెడ్డి గారి స్వగృహం నందు తేనేటి విందులో పాల్గొన్న...

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5...

పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లిగ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితి 47...

Related Articles

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం తండా నందు సోషల్ మీడియా కన్వినర్  అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి. ఎస్ మక్బూల్ ఈ కార్యక్రమంలో...

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కృషితో చెన్నాపురం చెరువులో గణేష్ నిమర్జనం ప్రారంభం.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.           మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. కీసర సర్కిల్...

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట / పొలిటికల్ పవర్, సెప్టెంబర్16:దగాపడ్డ నేల విముక్తి కోసం, వెట్టిచాకిరీ సంకెళ్లు తెంచేందుకు ‘భూమి కోసం.. భుక్తి కోసం’ ఉవ్వెత్తున...
error: Content is protected !!