డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: గోపాల్ పేట్ మండలం జయన్న తిరుమలాపురం గ్రామంలో గోర్ల వెంకటయ్య మరణించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గోర్ల వెంకటయ్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. గోర్ల వెంకటయ్య లేని బాధ నుంచి కోలుకొని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ,నాయకులు పాల్గొన్నారు.

