*ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మహిళా మండలీ అధ్యక్షురాలు గుర్రం జయసుధ*
*అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ 9 టీవీ న్యూస్ (ఆర్సి కారం వెంకటేష్)* సెప్టెంబర్ 13: ములకలపల్లి మండల కేంద్రంలో వినాయక చవితి వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు గుర్రం జయసుధ మండల ప్రజలకు, పార్టీ శ్రేణులకు ప్రత్యేకంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మండల ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణనాథుని మండపాలను అభినందించారు. భక్తులందరూ భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
పండుగను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, దైవభక్తితో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పండుగ వేళ ప్రజలతో మమేకమై వేడుకల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. విఘ్నేశుని దయతో మండలంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.


