ePaper
Thursday, June 4, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి ఉత్సవాల ""సన్నాహక సమావేశం""

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి ఉత్సవాల “”సన్నాహక సమావేశం””

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 19 2026: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన కవులు, సాహితీవేత్తలు సమావేశమై 28.05.2026రోజు మొట్టమొదటి వనపర్తి శాసనసభ్యులు సురవరం ప్రతాప్ రెడ్డి 130వ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిరంజన్ రెడ్డి స్వగృహంలో సన్నాహక సమావేశం నిర్వహించారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు. సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి ఉత్సవాలలో ముఖ్య వక్తలుగా సాగునీటిరంగ నిపుణులు వి ప్రకాష్, శ్రీ శ్రీధర్ రావు దేశ్ పాండే మరియు ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు పాల్గొంటారని అదేవిధంగా ఈ ఉత్సవ సమావేశములో ప్రస్తావించే పలు అంశాల గురించి చర్చించారు అని అశోక్ తెలిపారు.

ఈ సన్నాహక సమావేశములో సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ సాహితీవేత్తలు వీరయ్య, బలరామ్, నారాయణ రెడ్డి, బైరోజు చంద్రశేఖర్, మల్యాల బాలస్వామి, సత్తార్, చంద్రశేఖర్, కిరణ్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, జోహెబ్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!