భూములు కోల్పోయిన రైతులందరి బ్యాంకు ఖాతాల్లో జమైన డబ్బులు
రిజర్వాయర్ల నిర్మాణంలో, కెనాల్ల ఏర్పాట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాట్లల్లో భూములు కోల్పోయిన అన్నదాతలను అందర్నీ హక్కున చేర్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం
గత ప్రభుత్వ పాలనలో భూములు కోల్పోయి నష్టపరిహారం అందక నానా ఇబ్బందులు ఎదుర్కొన్న బాధిత అన్నదాతలందరినీ హక్కును చేర్చుకుంది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 23 2026: ఘాణపసముద్రం, కర్నే తాండ లిఫ్ట్ బండరాయిపాకుల, కొంకలపల్లిలతో పాటు పలు కెనాల నిర్మాణంలో భూములు కోల్పోయిన అన్నదాతలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారాన్ని మంజూరు చేసింది. కేవలం కాగితాల పైన అభివృద్ధి చూపిన గత పాలకులు అన్నదాతల అవస్థలను పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
ఘనపసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతన్నలకు గత ప్రభుత్వం సూచించిన నష్టపరిహారం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండింతలు అధికంగా నష్టపరిహారాన్ని మంజూరు చేసి అన్నదాతలను ఆదుకుంది. ఉన్న భూములు కోల్పోయి ప్రభుత్వం మంజూరు చేసే నష్టపరిహారాన్ని కోసమే ఎన్నో రోజులలో ఎదురుచూస్తున్నామని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారాన్ని అంది తమ బాధలు తీర్చిందని అన్నదాతలు ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
