సాగంటి మంజుల నీ అభినందించిన ఏపీ మంత్రి
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్.
ఈ నెల 6,7 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ లో శ్రీ శ్రీ కళావేదిక, చైతన్య సారస్వత పరిషత్ సంయుక్తంగా నిర్వహించిన 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల్లో హనుమకొండకు చెందిన ప్రముఖ విద్యా వేత్త, సామాజిక వేత్త, కవయిత్రి, చిత్రకారిణి ఐన డాక్టర్ మంజుల సాగంటి తనదైన శైలీ లో తెలుగు భాషపై తనకున్న అభిమానాన్ని,అమ్మ భాషైనా తెలుగు భాషకు ప్రాముఖ్యత ఇవ్వాలని స్వయంగా రాసి కవితా గానం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ, టూరిజం & సాంసృతిక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్
గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ VC చైతన్య రాజు చేతుల మీదుగా సన్మానం తో మంత్రి నుండి పలు ప్రశంసలు అందుకున్నారు.ఈ కార్యక్రమం లో సంస్థ జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్, ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు..

