రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కలు ప్రారంభమైంది.
14 వార్డ్ కౌన్సిలర్ మైలాపూర్ సుధాకర్
జూన్ 28: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఐదేళ్లలోపు వయసున్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేస్తున్నారు. రాష్ట్రంలో 49.20 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. రైల్వేస్టేషన్లు, బస్ స్టాండ్లు, విమానాశ్రయాలు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేసారు. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లోనే ప్రకటించింది. కొన్ని దేశాల్లో పోలియో ఇప్పటికీ ప్రభావం చూపుతుండటంతో దేశంలోకి తిరిగి పోలియో రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండల 14 వ వార్డ్ కు చెందిన కౌన్సిలర్ మైలాపూర్ సుధాకర్ మరియు హెల్త్ సిబ్బంది ఆశ వర్కర్ జ్యోతి, రాజేశ్వరి,ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

