రంగా విగ్రహావిష్కరణకు ఆహ్వానం
*23న అశ్వారావుపేటలో కార్యక్రమం
*చైర్పర్సన్ జూపల్లి శశికళకు ఆహ్వానం
*వైస్ చైర్పర్సన్ జూపల్లి రమేష్బాబుకు ఆహ్వానం
పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ ఆగష్టు 21)
అశ్వారావుపేటలో ఈ నెల 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్పర్సన్ జూపల్లి రమేష్బాబులను మున్నూరు కాపు సంఘం నాయకులు ఆహ్వానించారు.
ఈ మేరకు వారి నివాసాలకు వెళ్లిన సంఘం నాయకులు ఆహ్వాన పత్రాలను అందజేశారు. బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన వంగవీటి మోహనరంగా ఆశయాలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు, సంఘం నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

