బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన కీసర సీఐ, ఎస్సై

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఓ కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిందితుడి నుంచి సీఐ ఆంజనేయులు రూ.10 లక్షలు డిమాండ్ చేసి, బిర్యానీలు, కూల్డ్రింక్స్ తెమ్మని వేధించాడు. దీంతో నిందితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సీఐ ఆదేశాల మేరకు రూ.5 లక్షలు లంచం తీసుకుంటున్న ఎస్సైని కీసర చెరువుగట్టు వద్ద అధికారులు పట్టుకున్నారు..🤟🏼

