ఈనెల 10వ తేదీన భాగ్యనగరానికి మోడీజీ రాక..

హైదరాబాద్ : ఈనెల 10వ తేదీన హైదరాబాదుకు దేశ ప్రధాని మోడీజీ వస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో మోడీజీ పాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉందని. దృష్టిలో పెట్టుకొని మోడీజీ భాగ్యనగరానికి వస్తున్నట్లు సూచించారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చంద్రారెడ్డి. సైబరాబాద్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మంత్రులు ఎంపీలు వారం రోజుల నుండి ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు.
