శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం -తోటగూడెం 15వ వార్షికోత్సవ సంబరాలు
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
ఈరోజు లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం -తోటగూడెం 15వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించినటువంటి రుద్రహోమయాగంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని స్వామివారి ఆశీర్వచనములు తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో రఘునాథ్ వెరబెల్లి తో పాటు మండల అధ్యక్షులు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు తోట సతీష్ కుమార్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కాండ్రపు వంశీ, సారం వినోద్, సిరిమండ్ల వెంకటేష్, దావనపల్లి మల్లేష్,వెన్న అంజి, దావనపల్లి సతీష్, జాడి కిషన్, కోన హరీష్,దుర్గం తిరుపతి, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొనడం జరిగింది.

