*రీల్స్ మోజు.. భార్యకు ‘పిండం’ పెట్టిన భర్త..!*

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
హరిద్వార్: సోషల్ మీడియా రీల్స్పై మోజు కుటుంబాల్లో ఎంతటి విభేదాలకు దారితీస్తుందో చూపించే ఘటన ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో వెలుగులోకి వచ్చింది. భార్య రోజంతా రీల్స్ చేయడం, కుటుంబ విషయాలను పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ డాక్టర్ భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
భార్యను ఎన్నిసార్లు వేడుకున్నా, “భర్తను అయినా వదులుతాను కానీ రీల్స్ చేయడం మాత్రం మానుకోను” అని ఆమె చెప్పిందని సమాచారం. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన భర్త, భార్యను తన జీవితంలో నుంచి పూర్తిగా దూరం చేసుకున్నట్టుగా భావిస్తూ, ఆమె ఫోటోకు దండ వేసి హరిద్వార్ గంగా నదికి తీసుకెళ్లాడు.
అక్కడ పూజారుల సమక్షంలో భార్యకు బ్రతికుండగానే పిండం పెట్టి, తర్పణం నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం ఫోటోను గంగానదిలో వదిలి, “దరిద్రం వదిలింది” అంటూ అక్కడి పూజారితో మాట్లాడిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు భర్త చర్య అతిగా ఉందని అంటుండగా, మరికొందరు సోషల్ మీడియా వ్యసనం కుటుంబ బంధాలను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా రీల్స్, షార్ట్ వీడియోల పిచ్చి కారణంగా కుటుంబ కలహాలు, విడాకులు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా “లైక్స్”, “ఫాలోవర్స్” కోసం వ్యక్తిగత జీవితాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రదర్శించడం వల్ల కుటుంబాల్లో దూరాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
*నిజం న్యూస్ సమాజానికి సందేశం:*
సోషల్ మీడియా వినోదానికి మాత్రమే పరిమితం కావాలి.
కుటుంబ బంధాల కంటే ఫోన్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు.
రీల్స్, షార్ట్ వీడియోలు జీవితాన్ని నాశనం చేసే స్థాయికి చేరకూడదు.
భార్యాభర్తలు పరస్పరం మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలి.
సోషల్ మీడియా వ్యసనం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి.
పిల్లలు, కుటుంబ సభ్యుల ముందు మంచి ఉదాహరణగా ఉండాలి.
