ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణనూతన డీఈవో విజయకుమారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు

నూతన డీఈవో విజయకుమారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 06 2026: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నూతన జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)గా బాధ్యతలు స్వీకరించిన విజయ కుమారిను బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూలమొక్కను అందజేసి, ఆమె విద్యాశాఖ అభివృద్ధికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు చేపట్టిన డీఈవో విజయకుమారికి వారు అభినందనలు తెలియజేస్తూ, జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపుదలకు ఆమె నాయకత్వం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ వనపర్తి జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, జీసీడీవో అస్రఖాద్రితో పాటు కేజీబీవీ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!