పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక/ పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భువనగిరి సెప్టెంబర్ 08 2026: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా, లక్షలాది మంది పేద విద్యార్థుల చదువులను, భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్ మండిపడ్డారు.ప్రధాన డిమాండ్లు:బకాయిల చెల్లింపు: పెండింగ్లో ఉన్న రూ. 12,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి.సర్టిఫికెట్ల విడుదల: బకాయిలు అందక కాలేజీలు సర్టిఫికెట్లు నిలిపివేయడంతో 10-12 లక్షల మంది పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు, ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారు. వారందరికీ తక్షణమే సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలి.విద్యా వ్యవస్థ పరిరక్షణ: కాలేజీ యాజమాన్యాలకు నిధులు చెల్లించి,సంక్షోభంలో పడ్డ విద్యా వ్యవస్థను కాపాడాలి.అక్రమ అరెస్టులపై ఆగ్రహం: విద్యార్థుల హక్కుల సాధన కోసం రాష్ట్ర బీజేపీ పిలుపునిచ్చిన “అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని నిరంకుశంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.రాత్రికి రాత్రే బీజేపీ నేతలను ఇళ్ల వద్ద నిర్బంధించడం, ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అరెస్టులకు పాల్పడటం ప్రభుత్వ పిరికిపంద చర్యలకు నిదర్శనమని విమర్శించారు.ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను పోలీసు బలగాలతో నొక్కేయడం సాధ్యం కాదని, ఇలాంటి నిర్బంధాలతో బీజేపీ పోరాటాన్ని ఆపలేరని హెచ్చరించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, బకాయిలు చెల్లించే వరకు బీజేపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా అక్రమ అరెస్టులు ఆపి, సమస్య పరిష్కారానికి తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
