*ఉరి వేసుకుని వ్యక్తి మృతి*

సెప్టెంబర్ 19: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
లక్షట్టిపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గుర్రాల జయకర్ అనే 40 సంవత్సరాల వ్యక్తి ఇంటి సమీపంలోని వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందరికీ పెళ్లి లయ్యాయి. మృతునికి కుటుంబ కలహాలతో నిన్న గొడవలు జరగగా మృతుడు తన సోదరులకు ఫోన్ చేసి నాకు ఇంట్లో కుటుంబ కలహాలతో ఎప్పుడు గొడవ జరుగుతుంది నాకు బతకడం ఇష్టం లేదు అని ఫోన్ చేసి చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు గుర్రాల చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. అని ఎస్సై భూపతి సురేష్ తెలిపారు.

