పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, దురదపాడు గ్రామంలోని గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడిని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వాదం అందుకున్నారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ, గణనాథుని దివ్య ఆశీస్సులు సమస్త ప్రజానీకంపై ఉండి, పాడిపంటలు, సుఖసంతోషాలతో ప్రజలంతా సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.గ్రామస్థుల ఆహ్వానం మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో యర్రా వసంతరావు, కాసాని నాగప్రసాద్, తుమ్మల లక్ష్మణరావు, యలమంచి రమణయ్య, నరుకుళ్ల చెన్నారావు, తాటి రవికుమార్, పండు శివ, తాటి రాముడు, లక్కింసెట్టి శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, అశ్వారావుపేట నియోజకవర్గ యువ రాజకీయ నాయకులు వాడే వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.


