ePaper
Friday, September 18, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*ప్రియుడి కోసం రూ.12 లక్షల సుపారీ.. భర్త హత్యకు భార్యే మాస్టర్ ప్లాన్!*

పొలిటికల్ పవర్ సమగ్ర దినపత్రిక తెలుగు PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన సులేమాన్ రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 17న హత్యకు గురైన వడ్లమాను గ్రామానికి చెందిన సులేమాన్ రాజు కేసులో భార్యే ప్రధాన నిందితురాలిగా తేలడం స్థానికంగా కలకలం రేపుతోంది.


పోలీసుల వివరాల ప్రకారం.. వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబుతో సులేమాన్ రాజు భార్య దుర్గామణి అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సులేమాన్ రాజు తరచూ భార్యను ప్రశ్నిస్తూ వేధించడంతో, అతడిని అడ్డు తొలగించాలనే కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ప్రియుడితో కలిసి భర్త హత్యకు రూ.12 లక్షల సుపారీ ఇచ్చిన దుర్గామణి, పక్కా ప్రణాళికతో హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్ ఛార్జింగ్ కేబుల్‌తో సులేమాన్ రాజును గొంతు నులిమి హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని ఉప్పులూరు రైవస్ కాలువలో పడేసినట్లు గుర్తించారు.

కేసుపై అనుమానం రావడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా, కాల్ డేటా, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికల ఆధారంగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి కారు, సెల్‌ఫోన్లు, నగదు, ఛార్జింగ్ కేబుల్ స్వాధీనం చేసుకున్నారు.

భార్యే ప్రియుడి కోసం భర్తను హత్య చేయించిన ఘటన ఏలూరులో తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

గిరిజన భూములపై రాజకీయ తోడేళ్ల కళ్ళు

✓ పేదరికంలో మగ్గుతున్న ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి.✓ పత్రాలు,...

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం...

*కుర్లి శివా రెడ్డి గారి స్వగృహం నందు తేనేటి విందులో పాల్గొన్న...

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5...

పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లిగ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితి 47...

Related Articles

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం తండా నందు సోషల్ మీడియా కన్వినర్  అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి. ఎస్ మక్బూల్ ఈ కార్యక్రమంలో...

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5 లక్షల లంచంలో భాగంగా రూ.1 లక్ష తీసుకుంటుండగా ఇద్దరు ట్రెజరీ అధికారులు, ఒక ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ కి పట్టుబడ్డారు.*_ _*ఒక...

భగవాన్ శ్రీ విశ్వకర్మ పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖ

ఖమ్మం, సెప్టెంబర్ 17: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావుతెలంగాణ బీసీ సంక్షేమ శాఖ...
error: Content is protected !!