ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*బిగ్ బ్రేకింగ్ : రేపటి మోడీ పర్యటనకు బండి సంజయ్ ఔట్ ⁉️*

 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్

– POCSO కేసుపై జాతీయ మీడియా ఫైర్… లోకల్ మీడియా మాత్రం సైలెంట్ మోడ్‌లో ఎందుకు..?

– మోడీ సభకు బండి సంజయ్ ఔట్..?

– ఇన్విటేషన్ కార్డులో కనిపించని పేరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!!

 

కరీంనగర్ జిల్లా పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి :-

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన POCSO కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న వేళ… జాతీయ మీడియా ఛానళ్లు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రసారం చేస్తూ దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే తెలంగాణలోని అనేక లోకల్ మీడియా ఛానళ్లు మాత్రం ఈ వ్యవహారంపై పూర్తిగా మౌనం వహించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.

 

కనీసం స్క్రోలింగ్ రూపంలో అయినా వార్తను ప్రసారం చేయకుండా చోద్యం చూస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన మీడియా సంస్థలు… ఎవరి ఒత్తిళ్లకు లోనై పెదవులు మూసుకున్నాయనే ప్రశ్నలు సామాన్యుల్లో వినిపిస్తున్నాయి.

 

ఇక ఇదే సమయంలో మరో కీలక పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రేపు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్న అధికారిక కార్యక్రమానికి విడుదలైన ఇన్విటేషన్ కార్డులో కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు కనిపించకపోవడం సంచలనంగా మారింది.

 

ఇటీవలి పరిణామాల నేపథ్యంలోనే బండి సంజయ్‌ను ప్రోగ్రాం నుండి దూరంగా పెట్టారా..? లేక ఇది కేవలం యాదృచ్ఛికమా..? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

 

ఒకవైపు జాతీయ మీడియా తీవ్రంగా ప్రశ్నలు లేవనెత్తుతుండగా… మరోవైపు రాష్ట్ర మీడియా నిశ్శబ్దం పాటించడం వెనుక అసలు కారణాలేమిటన్నది ఇప్పుడు ప్రజల్లో పెద్ద చర్చగా మారింది.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!