ePaper
Monday, September 14, 2026
📄 ePaper

గొల్లలమామిడాడలో కొవ్వూరి బసివి రెడ్డి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా దొరబాబు కృషితో బసివి రెడ్డి సేవలకు చిరస్మరణీయ గుర్తింపు

📰 Generate e-Paper Clip

  • పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే11:
    అపర దానకర్ణుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కీర్తిశేషులు కొవ్వూరి బసివి రెడ్డి కాంస్య విగ్రహాన్ని గొల్లలమామిడాడ గ్రామంలో యువ నాయకుడు చింతా దొరబాబు ఆధ్వర్యంలో సోమవారం ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై బసివి రెడ్డి సేవలను స్మరించుకున్నారు.
    సామాజిక సేవ, దాతృత్వం, ప్రజల పట్ల అపారమైన ప్రేమతో జీవించిన బసివి రెడ్డి చేసిన సేవలను నేటి తరాలకు తెలియజేయాలనే సంకల్పంతో దొరబాబు అవిరళంగా కృషి చేస్తున్నారని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. బసివి రెడ్డి జీవిత విశేషాలు, ఆయన చేసిన మంచి పనులు గ్రామ ప్రజలకు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల వారికి కూడా తెలిసేలా దొరబాబు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.
    ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఐదు తరాల అనంతరం కూడా బసివి రెడ్డి ఖ్యాతిని ప్రజల్లో నిలబెట్టడం సాధారణ విషయం కాదని, దొరబాబు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. బసివి రెడ్డి పేరు మరింతగా వ్యాప్తి చెందేలా కాంస్య విగ్రహ ప్రతిష్టాపన చేపట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
    గ్రామాభివృద్ధి, సేవా కార్యక్రమాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బసివి రెడ్డి ఒక ప్రతీకగా నిలిచారని, అలాంటి మహనీయుడి జ్ఞాపకాలను తరతరాలకు అందించాలనే లక్ష్యంతో దొరబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు.
    బసివిరెడ్డి విగ్రహా ప్రతిష్టతో గ్రామ ప్రజలు దొరబాబు సేవాభావాన్ని కొనియాడుతూ అభినందనలు తెలిపారు.

 

 

Latest Articles

సెయింట్ జోసెఫ్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

మందలపల్లిలో సహస్ర హీరో షోరూం ఘన ప్రారంభం – ముఖ్య అతిథిగా తాటి వెంకటేశ్వర్లు

సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపొలిటికల్...

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్...

Related Articles

వినాయక చవితి వేడుకల్లో డీజేలకు నో!

 అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు బిక్కవోలు మండలంలో పోలీసుల అవగాహన సమావేశం బిక్కవోలు: వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు బిక్కవోలు పోలీసులు ప్రత్యేక అవగాహన...

error: Content is protected !!