రుద్రూర్ మండల కేంద్రంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన గొండల శ్రీనివాస్ (40) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రుద్రూర్ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం… బొప్పాపూర్ గ్రామానికి చెందిన గొండల శ్రీనివాస్ గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిస అయ్యాడు. ఆదివారం ఉదయం తన పొలంలోని రూములో ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతునికి భార్య ,ఇద్దరు కుమార్తెలు కలరు. మృతుని భార్య రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మనోజ్ కుమార్ వెల్లడించారు.
మద్యానికి బానిసైన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య…
0
14
Previous article
Most Popular
- Advertisment -
